రేప్​ కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష
Man

రెండేళ్ల క్రితం బాలికను అపహరించి, అత్యాచారం​ చేసిన కేసులో రాజస్థాన్​లోని పోక్సో కోర్టు దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రూ.30,000 జరిమానా వేసింది.

13 ఏళ్ల బాలికను అపహరించి, అత్యాచారం​ చేసిన కేసులో దోషికి రాజస్థాన్​లోని పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రూ.30,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

కేసు వివరాలు..

రాజస్థాన్​లోని కోటా నగరంలో 2019 మార్చి 27న పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా 13 ఏళ్ల బాలికను.. మోను మనోవార్​ అనే 23 ఏళ్ల యువకుడు అపహరించాడు. తన బంధువుల ఇంట్లో బంధించి పలుమార్లు అత్యాచారం​ చేశాడు. పాఠశాల నుంచి తిరిగి రాలేదని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. 19 రోజలు తర్వాత ఆ అమ్మాయిని కాపాడిన పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత తీర్పు వెలువరించిన పోక్సో కోర్టు..మోను మనోవార్​ను సోమవారం దోషిగా తేల్చిందని పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ తెలిపారు.

ఇదీ చదవండి:టూల్​కిట్​ కేసులో దిశ రవికి బెయిల్

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.