రోడ్డు మధ్యలో శిలాఫలకం.. ప్రమాదాలకు కారణం
Accidents

విజయవాడ నగర శివారులోని నూజివీడు రహదారి డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన శిలా ఫలకం ప్రమాదాలకు కారణమవుతుందని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విజయవాడ-నూజివీడు రహదారిపై కిలోమీటర్ మేర సెంట్రల్ లైటింగ్​ను అధికారులు ఏర్పాటు చేశారు. వీటి ప్రారంభోత్సవానికి రోడ్డు డివైడర్ మధ్యలో శిలా ఫలకాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా సెంట్రల్​ లైటింగ్​ను ప్రారంభించారు.

కండ్రికకు వెళ్ళే మలుపు వద్ద ఏర్పాటు చేసిన ఈ శిలా ఫలకం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ శిలాఫలకం కనిపించకపోవడమే ప్రమాదాలకు కారణమని తెలుపుతున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.