ఎర్రన్నాయుడుకి నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్
chandrababu

దివంగత కేంద్ర మాజీ మంత్రి, తెదేపా నేత ఎర్రన్నాయడు జయంతి సందర్భంగా.. ఆయన సేవలను స్మరిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఎర్రన్నాయుడు ప్రజా బంధువు అని చంద్రబాబు కొనియాడారు. ప్రజా సమస్యలపై బెదురు లేకుండా స్పందించే కంచు కంఠం అని నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ప్రజా జీవితంలో ఆయన సేవలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు.

ఎర్రన్నాయుడు ప్రజా బంధువు: చంద్రబాబు

chandrababu naidu and lokesh pays tribute to erranaidu on his birth anniversary
ఎర్రన్నాయడు జయంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ ట్వీట్ చేసిన చంద్రబాబు

ప్రజా బంధువు స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ధైర్యం, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడని చంద్రబాబు కొనియాడారు. ఆయన ఆదర్శాలు, పోరాట స్ఫూర్తి బీసీలతో పాటు బడుగు, బలహీన వర్గాల వారందరికీ వరమయ్యాయని కీర్తించారు. పేదల పెన్నిధిగా, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా, పార్లమెంటులో ఆంధ్రుల గంభీర వాణిగా విరాజిల్లారని గుర్తు చేశారు.

ఎర్రన్న కంచు కంఠం: లోకేశ్

chandrababu naidu and lokesh pays tribute to erranaidu on his birth anniversary
ఎర్రనాయుడుకు ట్విట్టర్ ద్వారా నివాళులర్పించిన నారా లోకేశ్

ఎర్రన్నాయుడు అన్న పేరు కుల, మత, వర్గ, ప్రాంతీయ రాజకీయాలకు అతీతమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఎర్రన్న అంటే ప్రజా సమస్యలపై బెదురు లేకుండా స్పందించే కంచు కంఠమని అభివర్ణించారు.

ఇదీ చదవండి: పన్ను భారం పడకుండా ఉండాలంటే తెదేపాను గెలిపించండి: కేశినేని నాని

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.