
తెలంగాణ గిరిజన శక్తి నాయకులు సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలను హైదరాబాద్లో కలిశారు. తమ పోరాటానికి మద్దతు తెలపాలని వారు కోరారు. గిరిజన నాయకులకు తన మద్దతు ఉంటుందని షర్మిల తెలిపారు.
తెలంగాణలో గిరిజన తండా బోర్డు ఏర్పాటుకు, ఎస్టీలకు సంబంధించిన భాష అభివృద్ధికి తోడ్పాటు అందించాలని గిరిజన శక్తి నాయకులు సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలను హైదరాబాద్లో కలిశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. వైఎస్ఆర్ హయాంలో పోడు భూములు ఇచ్చారని.. తెరాస ప్రభుత్వంలో అవి అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
గిరిజనుల పోరాటానికి తన మద్దతు ఉంటుందని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ఎం. వెంకటేశ్ చౌహాన్, జాతీయ అధ్యక్షుడు ధరావత్ రాజేశ్ నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.శరత్ నాయక్ తదితరులు షర్మిలను కలిశారు.
- ఇదీ చూడండి : జీవశాస్త్రాల పురోగతికి ఔషధం