ట్రాక్టర్ ఢీకొని ఇంటర్ విద్యార్థిని మృతి

కాలేజీకని బయలుదేరిన ఆ విద్యార్థిని.. ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. నవ్వుతూ ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన తమ కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిందని.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాల పద్మావతి నగర్లో ట్రాక్టర్ ఢీకొని....యువతి మృతిచెందింది. ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న జువేరియా....ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయే క్రమంలో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలొదిలింది.
ట్రాక్టర్ ఢీకొని ఇంటర్ విద్యార్థిని మృతి
ఇదీ చదవండి: బనగానపల్లెలో.. విద్యుదాఘాతంతో రైతు మృతి