గుగ్గిలిలో ఐదు ఎకరాల వరి కుప్పలు దగ్ధం
paddy

శ్రీకాకుళం జిల్లా గుగ్గిలి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు ఎకరాల వరి కుప్పలు దగ్ధమయ్యాయి. ఎంతో కష్టపడి పండించిన వరి పంటను బూడిదగా చూసిన ఆ రైతులు కన్నిరుమున్నీరుగా విలపిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం గుగ్గిలి గ్రామంలో అదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తూలుగు లక్ష్మణరావు, ఎలమంచిలి రాజు అనే రైతులకు చెందిన ఐదు ఎకరాల వరి కుప్పలు కాలిపోయాయి. దీంతో ఆ రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రాజకీయ కక్షతోనే గుర్తుతెలియని వ్యక్తులు ధాన్యం కుప్పలకు నిప్పంటించి ఉంటారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి పండించామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: పరదా పట్టల కోసం ఇద్దరు మిత్రుల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.