
11:47 February 23
బొగ్గు కుంభకోణం కేసు- అభిషేక్ నివాసంలో సీబీఐ
-
#WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee arrives at nephew and TMC leader Abhishek Banerjee's residence
— ANI (@ANI) February 23, 2021
Abhishek's wife, Rujira, is expected to answer CBI's queries today in connection with the coal scam case pic.twitter.com/srmLo7awiW
టీఎంసీ ఎంపీ, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు.. అభిషేక్ బెనర్జీ నివాసంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. బొగ్గు కుంభకోణం కేసులో అభిషేక్ భార్య రుజిరా బెనర్జీకి నోటీసులు ఇచ్చిన సీబీఐ.. విచారణ కోసం కోల్కతాలోని వారి నివాసానికి వెళ్లారు.
దక్షిణ కోల్కతా కాలిఘట్లోని వారి నివాసంలో సుమారు 90 నిమిషాల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి.. ఆమె బ్యాంకు ఖాతాల లావాదేవీలపైనే ముఖ్యంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది.
అయితే.. తొలిరోజు ప్రాథమికంగానే విచారణ జరిపారని, ఆమె సరిగా సమాధానాలు ఇవ్వలేదని అధికార వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో సుదీర్ఘంగా విచారించనున్నట్లు సమాచారం.
అల్లుడి ఇంటికి మమత..
సీబీఐ అధికారులు వెళ్లకముందు దీదీ.. సైతం ఆయన ఇంటికి వెళ్లారు. దాదాపు పది నిమిషాలు అభిషేక్ నివాసంలో ఉన్న మమత ఆ తరువాత వెనుదిరిగారు.
బొగ్గు చౌర్యానికి సంబంధించిన కేసులో ఇదివరకే అభిషేక్ భార్య రుజిర, ఆమె సోదరి మేనకా గంభీర్కు నోటీసులు ఇచ్చారు సీబీఐ అధికారులు.
కేసులో నిందితులు వీరే..
గతేడాది నవంబర్లో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. మాంఝీ అలియాస్ లాలా, ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ అమిత్ కుమార్ ధార్, కాజోర్ ఏరియా మేనేజర్ జయేశ్ చంద్ర రాయ్, ఈసీఎల్ చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ తన్మయ్ దాస్, కాజోర్ ఏరియా సెక్యూరిటీ ఇంఛార్జ్ దేబాషిశ్ ముఖర్జీని ఈ కేసులో నిందితులుగా చేర్చింది. మాంఝీ లాలాపై.. అక్రమ మైనింగ్కు పాల్పడటం సహా, కునుస్టోరియా, కాజోరా ప్రాంతాల్లో ఈసీఎల్ లీజుకు తీసుకున్న మైన్ల నుంచి బొగ్గును చోరీ చేశారన్న అభియోగాలను మోపింది.