భాజపా నేత చేసిన పనికి వైమానిక సిబ్బంది సస్పెండ్​
Chhattisgarh

ప్రభుత్వ హెలికాప్టర్​లో ఓ రాజకీయ పార్టీ నేత పెళ్లిఫోటోలు దిగడం.. వైమానిక సిబ్బందిపై సస్పెన్షన్​ వేటు పడటానికి కారణమైంది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​​లో జరిగింది.

ప్రభుత్వ హెలికాప్టర్​లో పెళ్లి ఫొటోలు దిగినందుకు గాను వైమానిక సిబ్బందిపై సస్పెషన్​ వేటు పడింది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

భాజపా నేత సంకేత్​ సాయికి కొన్ని రోజుల క్రితం పెళ్లయింది. అందరికంటే భిన్నంగా పెళ్లి ఫోటోలు దిగాలనుకున్నారు. అందుకు హెలికాప్టర్​ సరైనదని భావించారు. అందుకు రాష్ట్ర వైమానిక సర్వీస్​లో పని చేస్తున్న యోగేశ్వర్​ సాయి అనే వ్యక్తిని సాయం అడిగారు. అందుకు యోగేశ్వర్​ అంగీకరించాడు.

సంకేత్​ తన భార్యతో కలసి ప్రభుత్వ హెలికాప్టర్లు ఆగి ఉండే ప్రదేశానికి జనవరి 20న వెళ్లారు. అక్కడి భద్రతా సిబ్బంది జంటను అడ్డుకున్నారు. అయితే తనకు అనుమతి ఉందని సంకేత్​ చెప్పారు, అంతేకాకుండా అతని వెంట యోగేశ్వర్​ కూడా ఉండడం వల్ల భద్రతా సిబ్బంది అడ్డుచెప్పలేదని పోలీసులు తెలిపారు. తదనంతరం దంపతులిద్దరూ హెలికాప్టర్​లో ఫొటోలు దిగారు. సంబంధింత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. దీనిపై పెద్ద దుమారం రేగింది. దాంతో సదరు వైమానిక సిబ్బంది యోగేశ్వర్​ సాయిని ప్రభుత్వం సస్పెండ్​ చేసింది.

ఈ వ్యవహారంపై సీఎం భూపేశ్​ భఘేల్​ స్పందించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నవ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

అయితే కాంగ్రెస్​ నేత వికాస్​ తివారీ మాత్రం ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. భాజపా నేత ధరమ్​లాలా కూడా ఈ ఘటనను ఖండించారు.

ఇదీ చూడండి: తమిళిసై నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.