గజరాజుల ప్రతాపానికి ముగ్గురు బలి
elephant

మధ్యప్రదేశ్​లోని సిద్ధి జిల్లాలో ఘోరం జరిగింది. ఏనుగుల మంద ప్రతాపానికి ఇద్దరు పిల్లలు, ఓ వృద్ధుడు మృతి చెందారు.

మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. గజరాజులు ఇద్దరు పిల్లలు, ఓ వృద్ధుడిని చంపేశాయి. సిద్ధి జిల్లాలోని సంజయ్​ గాంధీ టైగర్​ రిజర్వ్​కు సమీపంలో గల హైకీ గ్రామంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

"సోమవారం రాత్రి ఏనుగుల గుంపు ఒక్కసారిగా గ్రామంపై పడింది. గోరెలాల్​ యాదవ్​ అతని మనుమలు రామ్​క్రిపాల్​ (12), రామ్​ ప్రసాద్​(13) ఇంటి నుంచి బయటపడి సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఏనుగుల మంద వారిని కింద పడేసి కాళ్లతో తొక్కేసింది. బాధితులు అక్కడికక్కడే మృతి చెందారు" అని సంజయ్​ గాంధీ టైగర్​ రిజర్వ్​ సబ్​-డివిజనల్​ అధికారి జయా త్రిపాఠీ తెలిపారు.

ఈ ఘటనతో గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. తిల్వారి- జానక్​పూర్​ రహదారిని దిగ్బంధించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: కర్ణాటకలో జిలెటిన్​ పేలి ఆరుగురు మృతి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.