ఏపీలో మార్చి 10న సెలవు దినం.. సీఎస్​ ఆదిత్యనాథ్ ఆదేశం
Breaking

ఆంధ్రప్రదేశ్​లో మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో సెలవు దినంగా ప్రకటించాలంటూ కలెక్టర్లను ఆ రాష్ట్ర సీఎస్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఆయన జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్​లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మార్చి 10వ తేదీన ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో సెలవు ప్రకటించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జారీ చేశారు.

మరోవైపు పోలింగ్​తో పాటు 14న కౌంటింగ్ జరగనున్న దృష్ట్యా ప్రభుత్వ భవనాలు, పాఠశాల భవనాలను వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. ఆయా రోజుల్లో సదరు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించాలని సూచిస్తూ ఆయన ఉత్తర్వులు ఇచ్చారు.

ఇదీ చదవండి: 'ఓటుకు నోటు కేసులో సీడీలు, హార్డ్​ డిస్కులు సమర్పించండి'

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.