కార్పొరేట్లకు పన్ను మినహాయింపులా..: అతుల్​కుమార్​
cpi

కార్పొరేట్​ కంపెనీలకు ఇచ్చిన పన్ను మినహాయింపులను ప్రభుత్వం వారికిచ్చిన బహుమతిగా సీఐపీ జాతీయ కార్యదర్శి అతుల్​కుమార్​ అంజన్​ ఎద్దేవా చేశారు. దేశంలోని సుమారు ఆరు లక్షల గ్రామాలకు కేవలం రూ.40 వేల కోట్ల బడ్జెట్​ కేటాయింపులు ఎలా సరిపోతాయని ఆయన నిలదీశారు.

నీతిఆయోగ్​ సమావేశంలో.. 'తయారీరంగ హబ్​గా భారత్​ను మార్చేందుకు.. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్రాలు కృషిచేయాలని' ప్రధాని మోదీ పాతపాటే పాడారని.. సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్​కుమార్​ అంజన్​ అన్నారు. హైదరాబాద్​లో జరుగుతోన్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి... పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.

88 రోజులుగా జరుగుతోన్న రైతుల ఆందోళనపై నీతి ఆయోగ్​ సమావేశంలో ఒక్కమాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్​లో గ్రామీణ అభివృద్ధికి కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించారని, 6 లక్షలకు పైగా గ్రామాలున్న దేశంలో ఈ నిధులు ఎంత వరకు సరిపోతాయని అతుల్​కుమార్​ ప్రశ్నించారు. కార్పొరేట్​ కంపెనీలకు బడ్జెట్​లో పన్ను మినహాయింపులు ఇచ్చారని, ఆయా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన బహుమతా..? అని నిలదీశారు.

కార్పొరేట్లకు పన్ను మినహాయింపులా..: అతుల్​కుమార్​

ఇవీచూడండి: అంతరిక్షంలోకి పెట్రోల్​, డీజిల్​ ఫొటోలు పంపండి: నారాయణ

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.