టాప్​ 10 న్యూస్ @ 5 PM
Breaking

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

  • తెరాస నామినేషన్​ వెనక్కి..

తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ నుంచి బీ-ఫాం అందుకున్న వాణీదేవి... మంత్రులతో కలిసి జీహెచ్​ఎంసీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే నామినేషన్ ఫారం సరైన ఫార్మాట్‌లో లేనందున రేపు మరోమారు నామపత్రాన్ని దాఖలు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఓటుతో గుణపాఠం చెబుదాం..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎంపీ మోహన్ ఆత్మహత్య!

దాద్రానగర్‌ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్(58) అనుమానాస్పద స్థితిలో మరణించారు. దక్షిణ ముంబయిలోని ఓ హోటల్‌లో ఆయన చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం పక్కనే గుజరాతీలో రాసి ఉన్న సూసైడ్ నోట్ దొరికిందన్న వార్తలు రాగా.. వాటిపై స్పందించేందుకు అధికారులు నిరాకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కేంద్ర ఆరోగ్య మంత్రికి చిక్కులు!

కొరొనిల్​ టాబ్లెట్​పై వివరణ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ను ఐఎంఏ డిమాండ్​ చేసింది. తమ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిందని పతంజలి సంస్థ చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉన్నావ్​ కేసులో 'ఫేక్​ పోస్టు'లపై..

ఉత్తర్​ ప్రదేశ్ ఉన్నావ్​ ఘటనపై నకిలీ వార్తలను పోస్ట్​ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో 8 ట్విట్టర్​ ఖాతాలపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. వీటిలో సీనియర్​ జర్నలిస్ట్​ బార్కా దత్​కు చెందిన 'మోజో స్టోరీ' ఖాతా సైతం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'గ్రే' లిస్ట్​లోనే పాక్​!

ఉగ్ర కార్యకలాపాల విషయంలో పాకిస్థాన్.. జూన్ ​వరకు ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ఫోర్స్ 'గ్రే' జాబితా​లోనే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశం గురించి అధికారులు, రాయబారులు చర్చించగా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు పాక్ పత్రిక వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నివేదిక'

15వ ఆర్థిక సంఘం నివేదికను రూపొందించే సమయంలో ఎదురైన సవాళ్లను ఇటీవీ భారత్​కు ప్రత్యేకంగా వివరించారు ఛైర్మన్​ ఎన్​కే సింగ్​. కరోనా సంక్షోభం అనంతరం నివేదికకు మార్పులు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సెన్సెక్స్ 1,145 డౌన్​

స్టాక్ మార్కెట్లలో వరుసగా ఐదో రోజూ బేర్​ విజృంభణ కొనసాగింది. సెన్సెక్స్ 1,145 పాయింట్లు కోల్పోయి 49,800 దిగువకు చేరింది. నిఫ్టీ 306 పాయింట్లు తగ్గింది. 30 షేర్ల ఇండెక్స్​లో టెక్ మహీంద్రా భారీగా నష్టాన్ని మూటగట్టుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'టీ20 వరల్డ్​కప్ మనదే!'

ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న టీ20 వరల్డ్​ కప్​ను భారత్​ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు యువ క్రికెటర్ సూర్యకుమార్​ యాదవ్​. ఇతర జట్లతో పోలిస్తే టీమ్​ఇండియా గొప్పగా ఆడుతోందని ప్రశంసించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాలీవుడ్ హీరోకు గాయాలు

బాలీవుడ్​ హీరో టైగర్​ష్రాఫ్​.. ఛారిటీ ఫుట్​బాల్​ మ్యాచ్​ ఆడుతూ గాయపడ్డాడు. హీరోయిన్ దిశా పటానీ.. ఆ సమయంలో అతడితో పాటే ఉండి జాగ్రత్తగా చూసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.