తెరాస నేతలతో రేపు కేటీఆర్​ కీలక సమావేశం
Breaking

పార్టీ నేతలతో.. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సమావేశం నిర్వహించనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలు ఖరారుచేయనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తెరాస నేతలతో బుధవారం.. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్​లో రేపు ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎన్నికల వ్యూహాలు ఖరారు చేయనున్నారు.

రేపటి సమావేశానికి నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, ఉపమేయర్, పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి హాజరుకానున్నారు. రేపు సాయంత్రం ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా నేతలతో కేటీఆర్‌ సమావేశమవుతారు. పట్టభద్రుల ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు.

హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్​, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇవాళ మూడు గంటలతో నామపత్రాల దాఖలుకు గడువు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువు ఉంది.

ఇవీచూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.