ఏవోబీలో పేలిన మందుపాతర.. జవానుకు తీవ్రగాయాలు
Breaking

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని మల్కన్​గిరి జిల్లా మత్తిలి ఠాణా పరిధిలో.. దోల్​దలి అటవీ ప్రాంతంలో మందుపాతర పేలింది. బీఎస్​ఎఫ్​కు చెందిన ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు.

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని మల్కన్​గిరి జిల్లా మత్తిలి ఠాణా పరిధిలోని.. దోల్​దలి అటవీ ప్రాంతంలో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని 160వ బెటాలియన్​కు చెందిన ధర్మేంద్ర సాహుగా గుర్తించిన అధికారులు చికిత్స కోసం అతడిని రాయ్​పూర్​లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

మావోయిస్టులు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో.. ఛత్తీస్​గఢ్ సీఆర్​పీఎఫ్, ఒడిశా బీఎస్​ఎఫ్​ బలంగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇదే సమయంలో మందు పాతర పేలి.. జవాను గాయపడ్డాడు.

ఇదీ చదవండి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు.. కార్మికురాలు మృతి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.