టిప్పర్​ ఢీకొని.. హైదరాబాద్​లో నేపాల్​ దంపతుల దుర్మరణం
alwal

పొట్టకూటికోసం నేపాల్​ నుంచి హైదరాబాద్​ వచ్చిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. గత రాత్రి ఓల్డ్​ అల్వాల్​ వద్ద టిప్పర్​ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

జీవనోపాధి కోసం హైదరాబాద్​ వచ్చిన దంపతులను రోడ్డు ప్రమాదం కబళించింది. ఆదివారం రాత్రి ఓల్డ్​ అల్వాల్​లో రోడ్డు దాటుతుండగా టిప్పర్​ ఢీకొని.. నేపాల్​కు చెందిన దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

అల్వాల్​ స్టేషన్​ పరిధిలో రిలయన్స్ మార్ట్ వద్ద గత ఏడేళ్లుగా నేపాల్​కు చెందిన నోమ్​లాల్​ బండారి, మీనాదేవి.. మరో ఇద్దరితో కలిసి ఫాస్ట్​ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత రాత్రి 12 గంటల సమయంలో పనిపూర్తిచేసుకొని.. ఇంటికి వెళ్తుండగా ఓల్డ్​ అల్వాల్​ ఇందిరా గాంధీ విగ్రహం పక్కన శివాలయం వద్ద రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్​ వారిని ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.

సమాచారం అందుకొని.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

టిప్పర్​ ఢీకొని.. నేపాల్​ వాసుల దుర్మరణం

ఇవీచూడండి: మరణంలోనూ వీడని భార్య భర్తల బంధం

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.