
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టగా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన... రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బండరావిరాలలో చోటు చేసుకుంది. మృతులు జంగయ్య, మహమ్మద్లు పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
న్యాయం చేయాలని మృతుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై టెంట్ వేసి ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు తెలిపారు. టిప్పర్ లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ట్రాలీ బోల్తా పడి ఇద్దరు కార్మికులు మృతి