భవనం పైనుంచి దూకి మహిళ బలవన్మరణం

భవనం పైనుంచి దూకి సత్య సంతోషిని అర్ధరాత్రి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలంలో జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం ఆర్ఎల్ నగర్లో బిల్డింగ్ పైనుంచి దూకి సత్య సంతోషిని అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: ఢీ కొట్టిన కారు.. బేకరీ యజమాని మృతి