తుడుందెబ్బ ఆధ్వర్యంలో గుస్సాడీ కళాకారుడు కనగరాజుకు సన్మానం
honor-to-gussadi-artist-kanagaraj-under-the-auspices-of-thudundebba

సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్​ తరాలకు అందించేందుకు కృషి చేయాలని గుస్సాడి నృత్య కళాకారుడు కనగరాజు అన్నారు. పద్మశ్రీ అవార్డ్​కు ఎంపికైన సందర్భంగా తుడెందెబ్బ నాయకులు ఆదిలాబాద్​ జిల్లాలో ఆయనను సన్మానించారు.

పద్మశ్రీ అవార్డ్​కు ఎంపికైన గుస్సాడీ నృత్య కలాకారుడు కనగరాజును ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద తుడుం దెబ్బ నాయకులు, స్థానికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కనగరాజు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ.. భవిష్యత్ తరాలకు​ అందించేందుకు కృషి చేయాలని సూచించారు.

ఆసిఫాబాద్​ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనగరాజు 1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముందు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్రం 2020లో పద్మశ్రీ అవార్డ్​కు ఎంపిక చేసింది.

ఇదీ చదవండి: నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.