
పట్టభద్రుల నియోజకవర్గం తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిపై భాజపా నేతలు ఈసీకి ఫిర్యాదుచేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిబంధనలను ఉల్లంఘించారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానం తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి నామినేషన్ సందర్భంగా నల్గొండ పట్టణంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై.. భాజపా నేతలు ఈసీకి ఫిర్యాదుచేశారు. పల్లా.. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్నారు.
తమ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి ఫ్లెక్సీలకు అనుమతించని అధికారులు తెరాసకు అనుమతిచ్చారని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. నల్గొండలో తెరాస నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదుచేశారు. రాజేశ్వర్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని భాజపా నేతలు కోరారు.
ఇవీచూడండి: వివాదంగా మారిన పల్లా ఫ్లెక్సీలు... తొలగించే పనిలో అధికారులు