
హైదరాబాద్లోని కాదేవి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఫోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి రుణాలు తీసుకొని మళ్లించి ఎగవేసినట్లు సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేసింది.
రుణాల పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.104 కోట్లు మోసం చేసిన అభియోగంపై హైదరాబాద్లోని కాదేవి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్పై సీబీఐ కేసు నమోదు చేసింది. కాదేవి ఇండస్ట్రీస్ ఛైర్మన్ ఎంబీఎస్ పురుషోత్తం, ఎండీ సూర్యప్రభాకర్, డైరెక్టర్ శైలజపై కూడా కేసు నమోదైంది.
ఫోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి రుణాలు తీసుకొని మళ్లించి ఎగవేసినట్లు సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఇదీ చూడండి: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల సందడి