ఎగ్జిబిషన్​ను ప్రారంభించిన వేణుగోపాలాచారి
joint

మహిళలు చిన్న తరహా పరిశ్రమలను ప్రారంభిస్తే ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుందని తెరాస నేత, మాజీ మంత్రి వేణుగోపాలాచారి అన్నారు. హైదరాబాద్​లోని హైదర్​గూడాలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష​న్​ను ఆయన ప్రారంభించారు.

ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెరాస నేత, మాజీ మంత్రి వేణుగోపాలాచారి అన్నారు. హైదరాబాద్​ శివారులోని హైదర్​గూడాలో కేవీఎస్​ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష​న్​ను ఆయన ప్రారంభించారు.

మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సొంతంగా చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం 2 నుంచి 5 లక్షల వరకు సబ్సిడీని అందిస్తుందని వేణుగోపాలాచారి తెలిపారు. ఈ ఎగ్జిబిషన్​లో మహిళలు నెలసరి సమయంలో ఉపయోగించే ప్యాడ్​ల​ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఇదీ చదవండి: పాస్‌పోర్టు కుంభకోణంలో 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్‌

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.