రెజ్లింగ్​ను ప్రోత్సహించేలా చర్యలు: కిషన్ రెడ్డి
Breaking

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెజ్లింగ్​ క్రీడను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్​లో 4 రోజులుగా జరుగుతున్న కుస్తీ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందించారు.

కుస్తీపోటీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​లో తాళ్ల గడ్డ రాజలింగయ్య కబడ్డీ స్టేడియంలో నిర్వహిస్తున్న కుస్తీపోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందించేందుకు ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. విజేతలకు ద్విచక్ర వాహనాలతో పాటు ఛత్రపతి శివాజీ ప్రతిమలను అందించారు.

9 ఏళ్లుగా..

యువతలో దాగి ఉన్న క్రీడాస్ఫూర్తిని వెలికి తీసే ఏకైక లక్ష్యంతో 9 ఏళ్లుగా... హిందూ వాహిని, భాజపా గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, గోవర్దన్ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సుమారు 400 మంది పైల్వాన్​లు తమ పేరు నమోదు చేసుకున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా ఈ పోటీలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా సురభి వాణీదేవి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.