భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంచందర్​రావు నామినేషన్
భాజపా

భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంచందర్​ రావు నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ తనపై పోటీ చేసినా గెలవరని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమవైపు ఉన్నారని స్పష్టం చేశారు.

హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంచందర్​ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో తనపై ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ పోటీ చేసినా గెలవరని ​ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నానని.. జనం తనవైపే ఉన్నారని స్పష్టం చేశారు. అంతకు ముందు బర్కత్​పురాలోని భాజపా నగర కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఎంపీ ధర్మపురి అర్వింద్​, కార్యకర్తలతో వచ్చి రిటర్నింగ్ అధికారికి రాంచందర్​ రావు నామినేషన్ పత్రాలు అందజేశారు. హైదరాబాద్‌లో వరదల సమస్యను మూడేళ్ల క్రితమే మండలిలో నిలదీసినట్లు తెలిపారు. కుటుంబ పాలన కోసమే తెలంగాణ వచ్చిన్నట్లు ఉందని సీఎంను దుయ్యబట్టారు. ఏ ఎన్నికల్లోనైనా తెరాసను ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఎంపీ అర్వింద్ అన్నారు. భారీ మెజార్టీతో రాంచందర్‌రావు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంచందర్​రావు నామినేషన్

ఇదీ చూడండి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.