
ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు
1. నిందితుల కస్టడీకి పిటిషన్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుల కస్టడీ కోరుతూ మంథని కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్పై విచారణ జరుగుతోంది. కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరి కస్టడీని కోరుతూ రామగిరి పోలీసులు పిటిషన్ వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. నామినేషన్ల పర్వం
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జోరుగా నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి బీ-ఫాం అందుకున్న వాణీదేవి... మంత్రులతో కలిసి జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. టీకాల రాజధానిగా హైదరాబాద్
ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీకాల రాజధానిగా హైదరాబాద్ ఉండటం ఎంతో గర్వకారణమని వెల్లడించారు. హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేటీఆర్... భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకా తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ధరల పెంపుపై రాహుల్ ఆగ్రహం
కేంద్రం సామాన్యుడి జేబులు ఖాళీ చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇంధన ధరలు పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'గత పాలకుల వల్లే అసోం వెనుకబాటు'
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన అసోం పర్యటనలో భాగంగా చమురు, గ్యాస్ ప్రాజెక్ట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వాల పాలన వల్లే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఆ కేసులో గంభీర్కు సీబీఐ ఉచ్చు!
బంగాల్లో బొగ్గు చౌర్యం కేసులో అభిషేక్ బెనర్జీ భార్య సోదరి మేనకా గంభీర్ను ప్రశ్నించేందుకు ఆమె ఇంటికి వెళ్లారు సీబీఐ అధికారులు. ఈ కేసుకు సంబంధించి అభిషేక్ భార్యతో పాటు, ఈమెకు ఆదివారమే నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. అమెరికాలో 5లక్షలకు చేరువలో
అమెరికాలో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. వైరస్ సోకి మరణించినవారి సంఖ్య 5 లక్షలకు చేరువైంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష దంపతులు ఈ రోజు రాత్రి శ్వేతసౌధంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించి, మౌనం పాటించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఫ్యూచర్ రిటైల్, బియానీకి నోటీసులు
ఫ్యూచర్ రిటైల్-అమెజాన్ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అమెజాన్ వాదనపై స్పందించాలని ఫ్యూచర్ రిటైల్, కిశోర్ బియానీకి సోమవారం నోటీసులు జారీ చేసింది. ఐదు వారాల తర్వాత మరోసారి ఈ అంశంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 'ధోనీతో కలిసి ట్రోఫీ..: ఉతప్ప'
సీఎస్కే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో ఆడేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానని వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నాడు. ఐపీఎల్లో ట్రేడింగ్ పద్ధతిలో చెన్నై సూపర్కింగ్స్ జట్టులో చేరిన ఉతప్ప.. ఆ జట్టు అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ వీడియోను సీఎస్కే ఫ్రాంచైజీ ట్విట్టర్లో పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఓటీటీలో ధనుష్ చిత్రం
ధనుష్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'జగమే తందిరమ్'. తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.