నగరంలో తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం
Accelerate

కరీంనగర్​లో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఊపందుకుంది. ఇంకా మూడు రోజుల సమయమే మిగిలి ఉండడంతో 60 డివజన్​ల పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలను నగర మేయర్​ సునీల్​ రావు పర్యవేక్షిస్తున్నారు.

అధిష్ఠానం తనకు అప్పగించిన పార్టీ సభ్యుత్వ నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తానని కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ వై.సునీల్​ రావు అన్నారు. నగరంలోని 9వ డివిజన్​లో తెరాస జెండాను ఆవిష్కరించిన ఆయన అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అమలు పరుస్తొన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని మేయర్​ సునీల్​ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం: సబిత

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.