'వామనరావు హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలి'
Breaking

న్యాయవాది వామన్​రావు హత్య కేసులో కుంట శ్రీనుతో పాటు కొంత మంది పెద్దల హస్తం ఉందని తెలంగాణ భాజపా ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. నిజామాబాద్​లో జరిగిన పార్టీ జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

హైకోర్టు న్యాయవాది వామన్​రావు దారుణ హత్య చూస్తుంటే రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థమవుతోందని తెలంగాణ భాజపా ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. నిజామాబాద్​ కేంద్రంలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వామన్​రావు హత్య కేసులో కుంట శ్రీనుతో పాటు కొంత మంది పెద్దల హస్తం ఉందని ఎండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. దేవుళ్ల విగ్రహాలపై దాడులు జరుగుతుంటే నాయకులు, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిజామాబాద్​ మేయర్​ భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆయన వారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. షుగర్ ప్యాక్టరీకి సంబంధించిన 125 ఎకరాల భూమిని బోధన్​ ఎమ్మెల్యే షకిల్​ నకిలీ పట్టాలు సృష్టించి కబ్జా చేశారని విమర్శించారు. ఈ విషయమై తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'దొంగ పాస్‌పోర్టులపై పోలీసుల దృష్టి ఏది?'

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.