'ఆడ పిల్లల రక్షణకు ప్రతి ఒక్కరూ ధీరత్వాన్ని ప్రదర్శించాలి'
Breaking

సంగారెడ్డి జిల్లాలోని హరిదాస్​పూర్​లో కన్యావందనం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు ఆయన పారాణి రాశారు.

ఆడపిల్ల పుట్టడాన్ని పండగలా భావించే గ్రామాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్​ అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండారెడ్డి మండలం హరిదాస్​పూర్​లో నిర్వహించిన కన్యావందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయనకు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. పలువురు చిన్నారులకు స్వామీజీ స్వయంగా పసుపు కుంకుమతో పారాణి రాశారు.

ఆడపిల్లలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ జటాయువులా ధీరత్వాన్ని ప్రదర్శించాలని అర్చకులు రంగరాజన్​ తెలిపారు. కన్యాదానం కార్యక్రమానికి తన వంతు సాయంగా రూ. 5000ను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నగేశ్​, డీఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


ఇదీ చదవండి: ఊరికోసం సొంత ఖర్చులతో ఎన్​ఆర్​ఐ సేవలు.!

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.